పేకమేడల కూలిన భవంతి, నలుగురి దుర్మరణం
కైరో: నాలుగు అంతస్తుల భవంతి ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. అందరూ చూస్తున్న సమయంలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈజిప్టు రాజధాని కైరో నగరంలో శనివారం ఉదయం ఈ భవనం కూలిపోయింది.
శనివారం ఉదయం ఎగువ కైరోలో నాలుగు అంతస్తుల భవనం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనంలో నివాసం ఉంటున్న ఇద్దరు పిల్లలతో సహ నలుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆరు మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈజిప్టు రాజధాని కైరో నగరంలో నిత్యం భవనాలు పేకమేడలు లాగా కుప్పకూలిపోతున్నాయి. గత సంవత్సరం 8 అంతస్తుల భవనం ఒకే సారి నేలమట్టం అయ్యింది. ఆ సమయంలో 8 మంది మరణించి సుమారు 25 మందికి తీవ్రగాయాలైనాయి.
కైరో నగరంలో భవనాలు కుప్పకూలిపోవడం సర్వసాధారణం అని అక్కడి అధికారులు అంటున్నారు. నియమాలు గాలికి వదిలి నాసిరకంగా ఒక అంతస్తు మీద ఒక అంతస్తు నిర్మించుకుంటూ వెళుతున్నారని, అందువల్లే భవనాలు కూలిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications