యజమాని సమాధి వద్దే నివాసం ఉంటున్న పిల్లి
ఇండోనేషియా :కుక్క విశ్వాసం గల జంతువు. యజమానులకుయ కుక్కలు విశ్వాసంగా ఉంటాయి. అందుకే విశ్వాసానికి కుక్కను పోలుస్తారు. అయితే కుక్కే కాదు విశ్వాసం చూపడంలో తామేమీ తక్కువ కాదని ఓ పిల్లి నిరూపించింది. తన యజమాని చనిపోవడంతో ఆ సమాధి వద్దే ఉంటుంది. అన్న పానీయాలు ముట్టకుండా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండోనేషియా లోని సెంట్రలో జావా ప్రాంతానికి చెందిన కుందరి అనే వృద్దురాలు పిల్లిని పెంచుకొంది.ఇటీవలే కుందరి మరణించింది. ఆమె మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననం చేశారు.కుందరి మరణించి ఏడాది కావస్తోంది. కుందరి మరణించిన నాటి నుండి పిల్లి మాత్రం స్మశాన వాటికను వీడడం లేదు.
కుందరిని పూడ్చి సమాది చేసిన ప్రాంతంలోనే ఎక్కువ కాలం గడుపుతోంది.ప్రతిరోజూ ఆ పిల్లి కుందరి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉండి వస్తోంది.కాని, కుందరి సమాది ప్రాంతాన్ని వదిలి రావడం లేదు.
స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చేవారు పిల్లికి ఆహారం అందించినా తినడం లేదంటున్నారు స్థానికులు.తనను పెంచిన యజమానురాలిపై విశ్వాసంతో ఆ పిల్లి సమాధి వద్దే ఉండడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.