మైనర్ బాలికపై అత్యాచారం,ఫేస్ బుక్ లో లైవ్, నిందితులు మైనర్లే
అమెరికాలో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకొన్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
చికాగో:అమెరికాలో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకొన్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
ఇంట్లో నుండి షాపింగ్ మాల్ కు వెళ్ళిన 15 ఏళ్ళ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి దుండగులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు.గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డవారిలో మైనర్లు కూడ ఉన్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడడానికి కొన్నిరోజుల ముందే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒప్పుకొన్నారు.చైల్డ్ ఫోర్నోగ్రఫీ, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
బాలికపై గ్యాంగ్ రేపు జరిగినట్టు అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మహాగార్గ్ నర్ వెల్లడించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు.ఆమె తప్పించుకొనే ప్రయత్నిస్తే కుక్కను వదలివేశారని బాధితురాలు తెలిపింది.
అత్యాచారానికి పాల్పడే సమయంలో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టారని, దాదాపు నలభైమంది ఈ వీడియో చూశారని , అయితే ఏ ఒక్కరూ కూడ ఫిర్యాదు చేయలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.