హోటల్ బిల్లు కంటే రెట్టింపు టిప్ , ఆనందంతో ఫోటో దిగిన సిబ్బంది
చికాగో: హోటల్ బిల్లు కంటే టిప్పు ఎక్కువగా చెల్లించడంతో ఆ హోటల్ సిబ్బంది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకొంది. రెస్టారెంట్లో సిబ్బంది చేసిన సర్వీసు కారణంగా హోటల్కు వచ్చిన ఓ వ్యక్తి హోటల్ బిల్లు కంటే ఎక్కువ టిప్పును ఇచ్చాడు.
అమెరికాలోని చికాగోలోని బొకా రెస్టారెంట్కు ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి డిన్నర్కు వెళ్ళారు. డిన్నర్కు సుమారు రూ.49,786 బిల్లు అయింది. యూఎస్ నగదులో సుమారు 759 డాలర్లు.
బిల్లుతో పాటు సుమారు 300 డాలర్లను టిప్పుగా ఇచ్చాడు. తన కుటుంబానికి ఫుడ్ సర్వ్ చేసిన వారితో పాటు కిచెన్లో పనిచేస్తున్న వారితో ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి మాట్లాడాడు. వారి కష్టసుఖాలను తెలుసుకొన్నాడు.ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న 17 మందికి ఒక్కొక్కరికి వంద డాలర్ల చొప్పున చెల్లించాడు. ఈ మేరకు ఒక్కొక్కరికి సుమారు రూ.1,31,190 చెల్లించారు. అంటే హోటల్లో భోజనం చేసినందుకు ఆ వ్యక్తి సుమారు రూ.49,786 ఖర్చు చేశాడు.
కానీ, ఆ బిల్లు కంటే హోటల్లో పనిచేసేవారి కోసం రూ.1,31,190 ఇచ్చాడు. టిప్పు రూపేణా తిన్నదానికి చేసిన ఖర్చు కంటే అదనంగా చెల్లించాడు. ఆ వ్యక్తి దాతృత్వాన్ని చూసి సంతోషపడి హోటల్ సిబ్బంది అతడితో ఫోటో దిగారు. ఆయనకు సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు.