వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిలీలో భూకంపం: ఐదుగురు మృతి, జపాన్‌కు ముప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

శాంటియాగో: చిలీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.2గా నమోదైంది. ఈ భూకంపంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. చిలీకి పొరుగున వున్న పెరూ, ఈక్వెడార్ దేశాల్లో సునామీ హెచ్చరిక జారీ చేశారు.

సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. పెరూలోనూ భూకంప తీవ్రత కనిపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చిలీలో 2010లో వచ్చిన భారీగా భూకంపంలో 500 మందికి పైగా మృతి చెందగా, భారీ ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే.

 Chile quake tsunami may reach Japan on Thursday

ఇదిలావుంటే, చిలీ భూకంప ప్రమాదం జపాన్‌ను కూడా తాకవచ్చునని జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. గురువారం ఉదయం భూకంపం జపాన్ సముద్ర తీరాన్ని తాకవచ్చునని హెచ్చరించింది.

మొదటి తాకిడి హోక్కాయిడో పసిఫిక్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెప్పింది. తాజా పరిణామాన్ని పరిశీలించి బుధవారం సాయంత్రం వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపింది.

English summary
The Japan Meteorological Agency (JMA) said Wednesday that the tsunami caused by strong quake off Chile could reach Japanese coasts early Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X