అతిపెద్ద కార్చిచ్చు దెబ్బకు.. పట్టణాలకు పట్టణాలు ఠా
ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది. పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.
చిలీ: ఆధునిక చరిత్రలోనే ఇదో అతిపెద్ద కార్చిచ్చు. అనూహ్యంగా రేగిన ఈ కార్చిచ్చు ఎంతకీ అదుపులోకి రాకపోగా.. విసురుగా వీస్తున్న పెనుగాలులు తోడవడంతో దావానలంలా మారి పట్టణాలకు పట్టణాలను బొగ్గు బొగ్గు చేసేస్తోంది.
ఈ కార్చిచ్చు దెబ్బకు మధ్య చిలీ ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ఆ ప్రాంత ప్రజానీకం బెంబేలెత్తిపోతోంది. ఇన్నాళ్ళూ వారు నివశించిన ఆ ప్రాంతాలను ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోతున్నారు.
శాంటా ఓల్గా పట్టణంలో వందలు వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు తప్ప వారి వద్ద ఏం లేకుండా పోయాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. విపరీతంగా వస్తున్న వేడి గాలులు, చుట్టేసిన నల్లటి పొగ కారణంగా సమీప ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రష్యా కూడా రంగంలోకి దిగింది. టన్నుల కొద్దీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు చిలీ ప్రాంత ప్రజానీకాన్ని వణికిస్తోంది.