ఇక అక్కడ మగవారిపై అత్యాచారాలూ నేరమే
బీజింగ్: చైనాలో ఇకపై మగవారిపై జరిగే అత్యాచారాలు నేరంగానే పరిగణించబడతాయి. మగవారిపై జరుగుతున్న అత్యాచారాలపై విచారించిన అక్కడి న్యాయస్థానాలు, ఇకపై వారిపై జరిగే అఘాయిత్యాలపై నేరాలు పరిగణించి కఠిన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఈ మేరకు అక్కడి క్రిమినల్ లాలో కూడా సవరణ జరిగింది. ఇకపై ఆడ, మగ.. ఎవరిపై అత్యాచారం చేసినవారికైనా ఐదేళ్లు కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
2010లో ఓ కంపెనీలో పనిచేసే సెక్యూరిటీ గార్డు మరో మగ ఉద్యోగి చేతిలో అత్యాచారానికి గురయ్యాడు. ఆ కేసు కోర్టుకి వెళ్లింది. అయితే అప్పటికి ఆడవాళ్లపై అత్యాచారన్నే క్రిమినల్ కేసుగా పరిగణించేవారు.
ఇలాంటి కేసు కొత్త కావడంతో న్యాయమూర్తులకు ఏమి చేయాలో తెలియలేదు. ఆ నిందుతుడు అత్యాచారం కేసులో కాకుండా సెక్యూరిటీ గార్డును గాయపరిచిన కేసులోనే స్వల్ప శిక్షకు గురయ్యాడు.
అయితే ఆ తీర్పుపై విమర్శలు తలెత్తడంతో క్రిమినల్ లాలో సవరణ చేయాలని అక్కడి నిపుణులు భావించారు. అంతేకాకుండా 14 సంవత్సరాలు దాటని వ్యభిచారిణులతో కలిసినా దానిని అత్యాచారంగానే భావించాలని సవరణ జరిగింది.