చైనా వింత వాదన: గత 70 ఏళ్లలో ఏ దేశానికి చెందిన ఇంఛ్ భూమినీ ఆక్రమించుకోలేదట
బీజింగ్: భారత్-చైనాల సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ దేశపు అధికార ప్రతినిధి హూ చున్యింగ్ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. గత 70 ఏళ్లలో చైనా ఇతర దేశాలకు చెందిన ఇంచ్ భూమిని కూడా ఆక్రమించలేదని వ్యాఖ్యానించారు. అంతేగాక, భారత పై ఆరోపణలు కూడా ఎక్కుపెట్టారు.
Recommended Video
వాస్తవాధీన రేఖను భారత బలగాలే దాటాయని చైనా ప్రతినిధి ఆరోపించారు. ప్యాంగ్ సరస్సు వద్ద భారత బలగాలు మోహరించాయని తెలిపారు. అయితే, తాము ఇరుదేశాల మధ్య శాంతినే కోరుకుంటున్నామని చెప్పారు. చైనా గత 70 ఏళ్లలో ఒక యుద్ధం కూడా చేయలేదని, ఏ దేశానికి చెందిన ఇంఛ్ భూమిని కూడా ఆక్రమించుకోలేదని పునరుద్ఘాటించారు.
వాస్తవాధీన రేఖను చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడూ దాటలేదని చున్యింగ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద చైనా స్టేటస్ కో మార్పుకు పాల్పడిందని, భారీగా బలగాలను మోహరించిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
సరిహద్దులో
ఉద్రిక్తతలను
తగ్గించేందుకు
ఇరుదేశాలకు
చెందిన
బ్రిగేడియర్
స్థాయి
అధికారులు
సోమవారం,
మంగళవారం
కూడా
సమావేశాలు
నిర్వహించారు.
చైనా
అదే
తప్పుడు
వాదనలు
చేయడం,
వాస్తవాలను
దాచేయడంతో
ఈ
సమావేశాలు
అర్ధాంతరంగా
ముగిశాయి.
దీంతో
సమస్యకు
ఎలాంటి
పరిష్కారం
లభించలేదు.
1962లో
చైనాతో
యుద్ధం
జరిగిన
నాటి
నుంచి
ఆ
దేశం
సరిహద్దులో
ఎప్పుడూ
ఏదో
సమస్యను
సృష్టిస్తూనే
ఉంది.
ఓ వైపు పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపుతుంటే.. మరో వైపు చైనా తన బలగాలను పంపుతోంది. ఈ రెండు శత్రుదేశాలను కూడా భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. అంతేగాక, వాటికి ధీటుగా స్పందిస్తూ బుద్ధి చెబుతున్నాయి. గత జూన్ నుంచి చైనా సరిహద్దులో ఘర్షణలకు దిగుతోంది. దీంతో భారత్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దులో రెండు దేశాల బలగాలు భారీగా చేరుకోవడంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.