అమేరికా , చైనా మధ్య ముదురుతున్న వివాదం... చైనా విద్యార్థులకు హెచ్చరికలు
అమేరికా చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన ఆంక్షలు ఆయా దేశాల పౌరులపై ప్రభావం పడుతోంది. దీంతో ఆమేరికా వెళ్లే చైనీస్ విద్యార్థులుకు పలు చైనా పలు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా అమేరికా వెళ్లే విద్యార్థులు ,యూఎస్ నుండి బధ్రతా పరమైన వేధింపులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.దీంతో యూఎస్కు ప్రయాణం చేసే వారు అక్కడి చట్టాలు, నిబంధనలు ముందే తెలుసుకోవాలని సూచించింది.
కాగా తాజాగా అమేరికా విధిస్తున్న ఆంక్షలతో చాల సంవత్సరాల తర్వాత అమేరికాకు వెళ్లే చైనీయుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. కాగా రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన నిబంధనలు కఠినతరం అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే చైనా టెలికాం కంపనీ అయినా హువావేపై అమేరికా వాణిజ్య అంక్షలను కఠినతరం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య గత ఏడాదీ కాలంగా ఉద్రిక్త పరిస్థితుల నెలకోన్నాయి.
కాగా చైనా విద్యార్థులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇంటర్యూల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కోంది. ఈనేపథ్యంలోనే చైనా నుండి నిధులు పోందుతూ యూఎస్లో ఉన్న కంపనీలను కూడ చైనా విదేశాంగశాఖ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.