నేపాల్ విద్యార్థులకు నిర్భంధ చైనా భాష...!
నేపాల్లో ప్రైవేట్ స్కూళ్లు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నాయి. అయితే ఈ ఆర్ధిక సమస్యను అధిగమించేందుకు పక్కదేశం బాష మీద ఆధారపడుతున్నారు. ఈనేపథ్యంలోనే చైనీస్ బాషను అక్కడి విధ్యార్థులకు నిర్భంధం చేస్తున్నాయి. అలా నిర్భంధం చేయడం వల్ల చైనా భాషను బోధించే టీచర్లు ఖర్చు చైనా దేశ రాయభార కార్యాలయం భరిస్తుంది. దీంతో నేపాల్ విద్యార్థులకు చైనా బాషను నిర్భంధం చేశారు.
నేపాల్ ప్రవైట్ స్కూల్స్ విద్యార్థులకు పక్కదేశం చైనా బాషను నిర్బంధంగా బోధించనున్నారు. ఇందుకోసం చైనా దేశమే టీచర్ల జీత భత్యాలను అందించనుంది.అయితే నెపాల్ స్కూల్ టీచర్కు వసతి కల్పిస్తే చాలు. దీంతో స్కూల్స్ నిర్వహాణ భారం తగ్గించుకునేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు చైనీస్ లాంగ్వేజ్ను నిర్భంధంగా బోధించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం ఎమిటంటే ఇప్పటికే కోన్ని స్కూళ్లలో చైనీస్ను బోధిస్తున్నప్పటికి ప్రస్థుత విద్యా సంవత్సరం నుండి మాత్రం చైనాలోని కొన్ని ప్రాంతాల్లో నిర్భంధం చేశారని అక్కడి మీడిమా కథనాలు రాసింది.
నిర్భంధ కోసం నెపాల్ పట్టణంలోని పది ప్రవైటు స్కూళ్లు నిర్భంధ చైనా భాషను బోధించడానికి అంగీకరించారని తెలిపారు. కాగా వీటిలో నేపాల్లోని పోఖోరా లాంటీ ప్రాంతాల్లో కూడ దీన్ని అంగీకరించినట్టు కథనం వెలువడింది.అయితే నేపాలీయులకు చైనీస్ నిర్బంధ విద్యపై అక్కడి మాత్రం అధికారికంగా ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.