కావాలనే కయ్యం: గల్వాన్ వ్యాలీ ఘర్షణపై అమెరికా ప్యానెల్
గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. అయితే చైనా ప్రభుత్వం కావాలనే ఘర్షణకు దిగిందని అమెరికా భద్రతా ప్యానెల్ రిపోర్ట్ చేసింది. ఆ సమయంలో భారత వైపు నుంచి మరణాలు సంభవిస్తాయని డ్రాగన్ భావించిందని పేర్కొన్నది. జూన్లో గల్వాన్లో ఘర్షణ జరిగే కొద్దిరోజుల ముందు అమెరికా చైనా ఆర్థిక, భద్రతా కమిషన్ అమెరికా కాంగ్రెస్కు వార్షిక నివేదిక సమర్పించింది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పెంచేలా చైనా వ్యవహారించిందని కూడా వివరించింది.
జూన్ 15వ తేదీ రాత్రి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత ఆర్మీపై దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. రాళ్లతో దాడి చేయడంతో కల్నల్ సంతోష్ సహా 20 మంది చనిపోయారు. అయితే పీఎల్ఏలో మాత్రం చనిపోయిన వారి వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే భారత్తోపాటు అమెరికా నిఘా వర్గాలు కూడా 35 నుంచి 40 మంది వరకు చనిపోయారని తెలిపింది. కానీ చైనా మాత్రం ధీనిని ధృవీకరించకపోవడం విశేషం.
గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బలగాల మొహరింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫ్రాన్స్ నుంచి ఇండియా రాఫెల్ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.