చైనా కొత్తతరం క్షిపణి! ధ్వనికన్నా 10 రెట్ల వేగంతో.. ప్రపంచంలో ఎక్కడికైనా..
బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.
బీజింగ్: బహుళ అణు వార్హెడ్లను మోసుకెళ్లే అధునాతన ఖండాంతర క్షిపణిని చైనా రూపొందించింది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చేరగలదని ఆ దేశ అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.
డాంగ్ఫెంగ్-41 అనే ఈ క్షిపణి.. ధ్వని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. శత్రుదేశపు క్షిపణి హెచ్చరిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థలను ఏమార్చి దాడులు చేయగలదు. వచ్చే ఏడాది చైనా సైన్యం అమ్ములపొదిలో ఈ క్షిపణి చేరనుంది.
ఈ అధునాతన ఖండాంతర క్షిపణిలో మూడు అంచెలు ఉన్నాయి. అవన్నీ ఘన ఇంధనంతో పని చేస్తాయి. ఈ క్షిపణి కనీసం 12 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంటే.. ప్రపంచంలో ఏ ప్రాంతంమీదైనా ఇది విరుచుకుపడగలదు.
డాంగ్ఫెంగ్-41 క్షిపణి తనతోపాటు 10 అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగానంతరం.. అవన్నీ క్షిపణి నుంచి విడిపోయి.. నిర్దేశించిన రీతిలో వేరు వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. అమెరికాను దృష్టిలో పెట్టుకొనే చైనా దీన్ని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.