గల్వాన్ లోయ: సైనికులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న చైనా.. భారత సరిహద్దులో గన్స్ వాడకంపై నిషేధం వల్లేనా?
Recommended Video
తమ బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీటభూమికి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్నట్లు చైనా తెలిపింది.
దీనికి వెనుక గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది.
1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు.
ఘర్షణలో తమ వైపు ఎంత మంది మరణించారో చైనా వెల్లడించలేదు. అయితే, 20 మంది తమ సైనికులు అమరులయ్యారని, 76 మందికి గాయాలయ్యాయని భారత్ తెలిపింది.
- భారత్, చైనా: ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో సైన్యానికి శిక్షణకు సంబంధించిన వార్తలు చైనా అధికారిక వార్తా సంస్థల్లో జూన్ 20న వచ్చాయని హాంగ్కాంగ్ మీడియా వెల్లడించింది.
ఎంబో ఫైట్ క్లబ్కు చెందిన 20 మంది యోధులను టిబెట్ రాజధాని లాసాకు తరలిస్తున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ తెలిపింది. అయితే భారత్ సరిహద్దుల్లోని బలగాలకు వీరు శిక్షణ ఇవ్వబోతున్నారా? అనే విషయాన్ని స్పష్టంచేయలేదు.
ఈ నెల 15న గల్వాన్ లోయలో ఘర్షణలకు సంబంధించి తప్పు మీదంటే మీదని అణ్వాయుధ దేశాలైన భారత్, చైనా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
అక్సాయ్ చిన్కు సమీపంలో కఠినమైన వాతావరణ పరిస్థితులతోపాటు భారీ ఎత్తులో ఉండే ఈ వివాదాస్పద ప్రాంతం తమదని భారత్ చెబుతోంది. అయితే ప్రస్తుతం ఇది చైనా నియంత్రణలో ఉంది.
రెండు బలగాల మధ్య ఘర్షణల్లో మరణాలు సంభవించడం.. గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి.
తాజా ఘర్షణలకు కొన్ని వారాల ముందు నుంచీ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్-చైనా సరిహద్దు బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
- 'చైనాతో భారత్కు ముప్పు.. రంగంలోకి అమెరికా సైన్యం’ - మైక్ పాంపియో
భారత్, చైనా దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం.. గల్వాన్ లోయ ప్రాంతంలో సైనికులు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించకూడదు.
ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో ఇనుప ముళ్ల గదలను, రాడ్డులను, కర్రలను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ పరిస్థితుల మధ్య చైనా తమ సైనికులకు కఠోర పరిస్థితులను తట్టుకునేలా తీవ్రమైన శిక్షణ ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- డెక్సామెథాసోన్: కరోనావైరస్కు మంచి మందు దొరికినట్లేనా?
- కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- గల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? 'పది మందిని విడుదల చేసిన చైనా’
- 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా
- అమెరికా వీసా: హెచ్1బి సహా ఉద్యోగ వీసాలన్నీ 2020 చివరివరకూ బంద్ - ట్రంప్
- టిబెట్ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)