మోడీ, జిన్పింగ్ సమావేశం ఫలవంతం, భారత్తో బలమైన బంధం ఆశిస్తున్నాం: జిన్పింగ్
భారత్తో సరైన మార్గంలో బలమైన బంధాన్ని చైనా ఆశిస్తోందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికారిక మీడియా జున్హువా తెలియజేసింది.
బీజింగ్: భారత్తో సరైన మార్గంలో బలమైన బంధాన్ని చైనా ఆశిస్తోందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికారిక మీడియా జున్హువా తెలియజేసింది.
జియోమిన్ వేదికగా జరిగిన బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ... భారత్తో తాము బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు మోడీకి తెలిపారు.
పంచశీల ఒప్పందం లేదా దానికి అనుబంధంగా ఉన్న అయిదు సూత్రాల ప్రకారం భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా జిన్పింగ్ తెలిపినట్లు సమాచారం.
సుమారు మూడు మాసాలపాటు ఇరు దేశాల నడుమ కొనసాగిన డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరపడిన తర్వాత మోడీ, జిన్పింగ్ మధ్య జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం ఫలవంతమైనట్లు చైనా మీడియా కూడా పేర్కొంది.
అలాగే ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఆశిస్తున్నట్లు కూడా జిన్పింగ్ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన భారత్, చైనాలు ప్రపంచంలోనే అతి పెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 1954లో భారత్, చైనాల మధ్య కుదిరిన పంచశీల ఒప్పందాన్ని గుర్తుచేసుకున్నారు.
దీని ప్రకారం రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వం పట్ల పరస్పర అవగాహన, దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇతర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు, శాంతియుత సహజీవనం అనేవి ప్రధానమైనవి.
అంతర్జాతీయ సంబంధాల్లో ప్రంపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుకగా పంచశీలను భావిస్తారు. ఈ ఒప్పందాన్ని 1954 మే 29 న భారత్, చైనా, మాయన్మార్ మధ్య శాంతి, సుహృద్భావం కోసం చేసుకున్నాయి.