వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్
భారత గగనతలంలోకి చైనా మరోసారి వచ్చి, ఉల్లంఘనకు పాల్పడింది. చైనాకు చెందిన హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది.
న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి చైనా మరోసారి వచ్చి, ఉల్లంఘనకు పాల్పడింది. చైనాకు చెందిన హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది.
సైనో-ఇండియా సరిహద్దులోని భరాహోటి ప్రాంతంలో అనుమానిత చైనా హెలికాప్టర్ కనిపించినట్టు అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన చాపర్ నాలుగు నిమిషాల పాటు చక్కర్లు కొట్టినట్టు చమోలీ ఎస్పీ త్రిపాఠీ భట్ తెలిపారు.
గతంలోనూ చైనా ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే చైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
A suspected Chinese helicopter was today seen flying over Indian territory in Barahoti area of Chamoli district close to Sino-India border, prompting authorities to launch a probe.
Story first published: Sunday, June 4, 2017, 9:49 [IST]