వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు బోనస్

|
Google Oneindia TeluguNews

బీజింగ్: గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంటి వార్తలు ఒకటి వింటున్నాం. చైనాలోను ఇలాంటిదే జరిగింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్‌గా ఏకంగా ఒక్కొక్కరికి రూ.62 లక్షలు ఇచ్చారు.

క్యాష్ మౌంటేన్

క్యాష్ మౌంటేన్

చైనాలో న్యూ ఇయర్ ఫెస్టివెల్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివెల్ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాన్‌చాంగ్ పట్టణానికి చెందిన ఓ స్టీల్ ప్లాంట్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన ఉద్యోగుల కోసం ఏకంగా 300 మిలియన్ యువాన్లు ఖర్చు చేసింది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.34 కోట్లు.

 ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు

ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు

ఈ మొత్తం డబ్బును కొండలా పేర్చి, ప్రదర్శించారు. కంపెనీలోని ఆఫీస్‌లో ప్రదర్శనగా ఉంచారు. ఈ కంపెనీలో దాదాపు ఐదువేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందించింది. దీనిపై ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు.

 గతంలో పరిమిత సమయంలో తీసుకెళ్లినంత డబ్బు

గతంలో పరిమిత సమయంలో తీసుకెళ్లినంత డబ్బు

గతంలో ఇదే కంపెనీ ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చింది. కంపెనీలోని ఓ హాల్లో డబ్బు కట్టలను గుట్టలుగా పోసింది. ఒక్కో ఉద్యోగికి పరిమిత సమయం ఇచ్చి ఆ టైంలో ఎంత డబ్బును తీసుకెళ్లగలిగితే అంత తీసుకు వెళ్లమని చెప్పి బోనస్‌గా ఇచ్చింది.

English summary
With the Chinese New Year fast approaching, most companies are getting ready to hand out year-end bonuses to their employees. One such company is a steel plant in the city of Nanchang, in China's Jiangxi province and they are doing it in the most over the top way possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X