కరెన్సీ నోట్ల కోసం 'చిల్లర'ను అమ్ముకున్నాడు
బీజింగ్: ఆలోచన ఉండేలా కానీ, ఎలాంటి పరిస్థితులైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించాడు చైనాలో ఓ వ్యక్తి. చైనాలో జెన్జౌకి చెందిన ఓ వ్యాపారవేత్త జంగ్ దగ్గర దాదాపు 3 లక్షల యువాన్ నాణేలు జమయ్యాయి. తన దగ్గర పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి ఉండటంతో అందుకు కరెన్సీ నోట్లు కావాల్సి వచ్చాయి.
దీంతో జంగ్ తన దగ్గర పోగుపడిన సుమారు మూడు లక్షల యువాన్ నాణేలను నోట్లుగా మార్చేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే అన్ని చిల్లర నాణేలను ఒకేసారి మార్చడం కుదరదని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు బ్యాంకు రూల్స్ ప్రకారం రోజుకి 2వేల నుంచి 3వేల నాణేలను మాత్రమే తీసుకుంటామని చెప్పారు.
దీంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో జెంగ్కు ఓ అలోచన తట్టింది. తన సిబ్బందితో కలిసి నాణేలను మూటలుగా కట్టి అమ్మడం ప్రారంభించాడు. దీంతో చిల్లర అవసరం ఉన్నవారంతా జంగ్ దగ్గర వచ్చి చిల్లర కొనుక్కున్నారు. అలా తన దగ్గర ఉన్న చిల్లర సమస్యను అధిగమించి కార్మికులకు జీతాలు ఇస్తున్నాడు.