మోడీ ఆహ్వానం.. భారత్కు రానున్న చైనా అధ్యక్షుడు...
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ భారత్కు రానున్నారు. బిష్కేక్లో నిర్వహిస్తున్న బిష్కేక్ సమావేశంలో పాల్గోనేందుకు గురువారం ఉదయం వెళ్లిన ప్రధాని మోడీ ఆయనతో సమావేశం అయ్యాడు. అనంతరం జిన్పింగ్'ను భారత్కు రావాల్సిందిగా మోడీ ఆహ్వానించాడు. దీంతో ఆయన భారత్కు వచ్చేందుకు అంగీకరించినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చూస్తున్నారని వారు తెలిపారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్ లో కూడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ముఖ్యంగా దేశ,విదేశీ వ్యవహారాలను చర్చించారు. గత కొద్ది సంవత్సరాల నుండి రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి.
కాగా జిన్పింగ్తో సుమారు 20 నిమిషాల పాటు సమావేశం జరిగిందని తెలిపారు. కాగా జిన్పింగ్ మోడీ రెండవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమావేశం ఏర్పాటు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా రెండు దేశాల మధ్య పెండింగ్లో సమస్యలు పరిష్కారం కాగలవని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.