బొగ్గు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా దుర్మరణం చెందారు. పేలుడు దాటికి బొగ్గు గనిలో ఉన్న వారు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చైనాలోని గుయిజావో లోని ప్రావిన్స్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ పేలుడు సంభవించడంతో 10 మంది సంఘటనా స్థలంలో మరణించారని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
బొగ్గు గనిలో 40 మంది దాకా చిక్కుకున్నారని, వారి ఆచూకి గల్లంతు అయ్యిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అయితే పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని అధికారులు చెప్పారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చైనా మీడియా తెలిపింది. మరణించిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారు అయ్యాయని ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.