వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం: ఏడుగురు మృతి
కిన్షాసా: విమానాశ్రయంలో రన్వేపై దిగే సమయంలో ఓ విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న నివాసాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన ఓ కార్గో జెట్ విమానం ముజి-మయిలోని విమానాశ్రయంలో రన్వేపై ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి ఎయిర్పోర్టు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది.
దీంతో ఇళ్లలో ఉన్న ఏడుగురు స్థానికులు మృతిచెందారు. ఇళ్లు కూడా చాలావరకు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముజీ-మయిలోని ఎయిర్పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇప్పటికే కాంగో ఎయిర్వేస్ గత కొద్ది రోజుల నుంచి తమ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది.
Comments
English summary
At least seven people have been killed in the Democratic Republic of the Congo after a large cargo plane overshot the runway at an airport and struck a number of homes, officials say.
Story first published: Friday, December 25, 2015, 15:15 [IST]