Corona update:అమెరికాతో పోలిస్తే బ్రెజిల్ లో .. రోజురోజుకీ దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాలు
కరోనా కరాళ నృత్యంలో బ్రెజిల్ పీక్స్ కు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది . ఇప్పటి వరకు అతి పెద్ద కరోనా ప్రభావిత దేశంగా 22 లక్షలకు పైగా బాధితులతో యూఎస్ తాజాగా బ్రెజిల్ ఇప్పుడు 1 మిలియన్లకు పైగా కరోనావైరస్ నమోదు చేసి కరోనా కేసుల్లో రోజురోజుకూ ముందుకు పోతుంది. ఇక ఇప్పటివరకు బ్రెజిల్ లో 48,954 మరణాలను ఆ దేశం నిర్ధారించింది.
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం ... 87 లక్షలకు పైగా కేసులు .. టాప్ 5 దేశాలు ఇవే
బ్రెజిల్ లో ఒక్క రోజే 54,771 కొత్త కేసులు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజే 54,771 కొత్త కేసులను బ్రెజిల్ నమోదు చేసింది, ఇది దేశవ్యాప్తంగా మొత్తం 10,32,913 కు కరోనా కేసులకు అధికారిక లెక్కల ప్రకారం పెరిగింది. ఇక తాజాగా వరల్డ్ మీటర్ ప్రకారం బ్రెజిల్ లో కరోనా కేసులు 10,38,568 కాగా,ఇక కరోనా మరణాలు 49,090 గా నమోదయ్యాయి. కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఇంతగా బ్రెజిల్ లో పెరుగుతున్న ప్రధాన నగరాలలో సామాజిక దూరాన్ని పాటించకుండా రెస్టారెంట్లు, షాపులు మరియు ఇతర వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
కేసులు ఇలాగే పెరిగితే యూఎస్ ను అధిగమించే అవకాశం
ఇక ఈ పరిస్థితులు బ్రెజిల్ లో కేసుల సంఖ్య యునైటెడ్ స్టేట్స్ ను అధిగమించగలదని అంటున్నారు. బ్రెజిల్ త్వరలోనే వైరస్ బారిన పడిన దేశంగా మారవచ్చని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.ఇప్పుడు అమెరికా కంటే బ్రెజిల్లో పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తుంది .అమెరికాలో నిన్న 31799 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2295450కి చేరింది. నిన్న 704 మంది చనిపోయారు. ఇక బ్రెజిల్ లోనే ఒకేరోజులో ప్రపంచ దేశాల అన్నిటిలోకంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 55209 కేసులు పెరగటంతో మొత్తం కేసుల సంఖ్య 10,38,568కి పెరిగింది. అలాగే... మరణాలు కూడా అమెరికా కంటే ఎక్కువగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video
మరణాల పెరుగుదల కూడా ఆందోళనకరమే .. బోల్సోనారో నిర్ణయంతోనే ఈ పరిస్థితి
నిన్న 1221 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 49,090కి పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం బ్రెజిలే అని తాజా లెక్కల ప్రకారం తెలుస్తుంది. మొదట, బ్రెజిల్ చైనా, ఇటలీ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో వ్యాప్తి చెందినా బ్రెజిల్ లో మాత్రం కరోనా రాలేదు . అప్పటి భూకంప కేంద్రమైన హుబే ప్రావిన్స్ నుండి బ్రెజిలియన్ పౌరులను స్వదేశానికి రప్పించడానికి బోల్సోనారో అంగీకరించి వారిని తీసుకురావటంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలను ప్రమాదంలో పడేసినట్టు అయ్యింది .