coronavirus: థాయ్లాండ్లో 411, ఫిలిప్సీన్స్లో 262 పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 89 పాజిటివ్...
థాయ్లాండ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువవుతోన్నాయి. శుక్రవారం ఒక్కరోజు 89 కేసులు పాజిటివ్ రావడం భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో దేశంలో పాజిటివ్ వైరస్ సోకిన వారి సంఖ్య 411కి చేరింది. ఇటీవల మలేషియాలో జరిగిన మతపర సమావేశం, బాక్సింగ్ మ్యాచ్ వీక్షణ ద్వారా పాజిటివ్ కేసులు పెరిగాయని థాయ్లాండ్ ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
వైరస్ సోకిన 366 మందికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇప్పటికే 44 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారని వెల్లడించింది. కరోనా వైరస్ సోకి.. థాయ్లాండ్లో ఒకరు చనిపోయిన సంగతి తెలిసిందే.
Recommended Video
ఫిలిప్పీన్స్లో కూడా కరోనా పాజిటివ్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 32 పాజిటివ్ కేసులు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 262కి చేరింది. కరోనా వైరస్ బారినపడి దేశంలో 19 మంది మృతిచెందారు. శుక్రవారం వర్సిటీ ప్రొఫెసర్ ఒకరు చనిపోయారు. ప్రొఫెసర్ మృతితో చనిపోయిన వారి సంఖ్య 19కి చేరిపోయింది.