పెరిగిన కరోనా వ్యాప్తి వేగం: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన సౌదీ అరేబియా
జెడ్డా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం ప్రకటించింది. కోవిడ్ -19 తిరిగి వ్యాప్తి చెందడం, గత కొన్ని వారాలుగా రోజువారీ కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య వేగంగా పెరగడంతో.. సౌదీ అరేబియా తన పౌరులను
భారతదేశంతో సహా పదహారు దేశాలకు ప్రయాణించకుండా నిషేధించింది.
సౌదీ అరేబియా పౌరులు భారతదేశం కాకుండా ప్రయాణించడాన్ని నిషేధించిన పదహారు దేశాలను గమనించినట్లయితే.. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మేనియా, బెలారస్, వెనిజులా అని గల్ఫ్ న్యూస్ నివేదించింది.

ఇంకా, సౌదీ అరేబియాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో సున్నా మంకీపాక్స్ కేసులు కనుగొనబడిందని ప్రజలకు హామీ ఇచ్చింది. నివారణ ఆరోగ్య శాఖ డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ.. ఏదైనా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను పర్యవేక్షించడం, కనుగొనడం, ఏదైనా కొత్త కేసు ఉద్భవించినట్లయితే సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం తమకు ఉందని చెప్పారు.
'ఇప్పటి వరకు, మానవుల మధ్య వ్యాప్తి ప్రసార కేసులు చాలా పరిమితం, అందువల్ల కేసులను గుర్తించిన దేశాలలో కూడా దాని నుంచి ఏదైనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ' అని అసరి చెప్పారు.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 11 దేశాలలో 80 మంకీపాక్స్ వ్యాధి కేసులను నిర్ధారించింది. వ్యాప్తి పరిధి, కారణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వారు కృషి చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, అనేక దేశాలలో కొన్ని జంతు జనాభాలో వైరస్ స్థానికంగా ఉందని, స్థానిక ప్రజలు, ప్రయాణికులలో అప్పుడప్పుడు వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.