డాన్ కు భారీ షాక్: టీవీ చానెల్ హ్యాకింగ్ - పాక్ ఇళ్లల్లో భారత జెండా - అసలేం జరిగింది?
అసలే కరోనా కాలం.. భయంభయంగానే బక్రీద్ జరుపుకొని.. సండే వార్తా విశేషాల కోసం టీవీలు పెట్టిన పాకిస్తానీలకు ఊహించని దృశ్యాలు కనిపించాయి. నిప్పు-ఉప్పులా వ్యవహరిస్తోన్న దాయాదుల మధ్య దౌత్య సంబంధాలు కూడా క్షీణిస్తోన్న తరుణంలో.. పాకిస్తాన్ ఇళ్లలోని టీవీల్లో భారత జాతీయ జెండా ప్రత్యక్షం కావడం, ముందస్తు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు కనిపించడం కలకలం రేపింది.
Recommended Video
జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఆశాభావం - ఆసక్తికర వ్యాఖ్యలు - ఎస్ఈసీగా తిరిగి బాధ్యతల్లోకి..
పాకిస్తాన్ లోని అతిపెద్ద, మోస్ట్ పాపులర్ న్యూస్ ఛానెలైన 'డాన్ టీవీ'కి హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ఏకంగా లైవ్ ప్రసారాలనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం.. డాన్ టీవీలో ఓ యాడ్ ప్రసారం అవుతోండగా.. తెరలపై సడెన్ గా భారత జాతీయ జెండా కనిపించింది. జెండాతో పాటు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే సందేశం కూడా రాసుంది. ఈ అనూహ్య సంఘటనతో డాన్ టీవీ సిబ్బంది,యాజమాన్యం షాక్ కు గురయ్యారు.
తమ టీవీ చానెల్ పై హ్యాకర్లు దాడి చేశారని గుర్తించిన వెంటనే డాన్ టీవీ అప్రమత్తమైంది. సంబంధం లేని దృశ్యాలను టెక్నికల్ సిబ్బంది తొలగించారు. అయితే, ఎంతకాలంపాటు హ్యాకర్లు టీవీ ప్రసారాలను కంట్రోల్ చేశారు, అసలేం జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డాన్ యాజమాన్యం తెలిపింది. పోలీసు శాఖ ఐటీ విభాగానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చరిత్ర పొడవునా ఒక్కటిగా ఉండి, 1947 ఆగస్టు 14 పాకిస్తాన్, ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందడం తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగనుండగా హ్యాకర్ల ముందస్తుగానే శుభాకాంక్షలంటూ హల్ చల్ చేశారు.
రాజధానిపై వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు - ఉపఎన్నికకు సిద్ధం - ఆ 29 ఎమ్మెల్యేలపై ఒత్తిడి?
డాన్ టీవీపై సైబర్ దాడి చేసింది భారతీయ హ్యాకర్లే అయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల సంబంధాల నేపథ్యంలో ఔత్సాహిక హ్యాకర్లు తరచూ పరస్పరం సైబర్ దాడులకు పాల్పడిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. ఇటీవలే పీవోకేలోని కీలక ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైట్లు సైతం హ్యాకింగ్ కు గురయ్యాయి. ఆయా వెబ్ సైట్లలో ''కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి కోరుతున్నారు''తరహా రాతలు దర్శనమిచ్చాయి.