వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీలోనే దావూద్, అడ్రస్ ఇక్కడే: యూఎన్ రిపోర్ట్‌లో 139మంది పాక్ ఉగ్రవాదులు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడని ఐక్యరాజ్యసమితి కూడా తేల్చింది. తాజాగా ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) రూపొందించిన ఉగ్రవాద జాబితాలో దావూద్ తోపాటు ఎక్కువ మంది పాకిస్థానీయులే ఉండటం గమనార్హం

ఈ జాబితాలో పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 139 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది. పాక్‌లో ఉండే వీళ్లంతా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు యూఎన్ తెలిపింది. ఈ జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, 26/11 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఉన్నారు.

Dawood Ibrahims Karachi Address Mentioned In New UN Terror List

పాక్‌లోని రావల్పిండి, కరాచీ నుంచి దావూద్‌ పాస్‌పోర్టులు పొందినట్లు యూఎన్‌ పేర్కొంది. కరాచీలోని నూరాబాద్‌లో దావూద్‌కు ఓ ఖరీదైన బంగ్లా ఉన్నట్లు డాన్‌ తన కథనంలో రాసుకొచ్చింది. లష్కరే తొయిబా(ఎల్‌ఈటీ), జమాత్‌ ఉల్‌ దవా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఎక్కువ మంది ఈ జాబితాలో ఉన్నారు.

తమ దేశం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతోందని పాక్‌ చెబుతున్నప్పటికీ.. యూఎన్‌ విడుదల చేసిన ఈ జాబితాలో ఎక్కువ మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉండటంతో, ఆ ప్రాంతంలో ఉగ్రవాద ప్రాబల్యం అధికంగానే ఉందనే విషయం స్పష్టమవుతోంది.

English summary
The latest list of terror organisations and terrorists released by the UN Security Council lists 139 entities from Pakistan alone. These include Mumbai terror attack mastermind Hafiz Saeed's Lashkar-e-Taiba, Osama bin Laden's heir apparent Ayman al-Zawahiri, and Dawood Ibrahim, who has been sheltered by Pakistan since the 1993 Mumbai blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X