భవిష్యవాణి: పన్డేవా చెప్పిన జోస్యం నిజమవుతుందా?
యూరప్ను 2016లో ముస్లింలు ఆక్రమించుకుంటారని, 2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని బల్గేరియా మహిళ బాబా వాంగ పన్డేవా తాజాగా చెప్పిన జోస్యాలివి. ఈ ఏడాదికి ఆమె చెప్పిన జోస్యంపై మళ్లీ ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది.
‘‘2016లో యూర్పపై ముస్లింలు దాడి చేస్తారు. ఇది యుద్ధానికి దారి తీసి యూర్పలోని జనమంతా మృత్యువాత పడతారు'' అని వాంగ పన్డేవా 1996కు ముందే చెప్పారు. సిరియాలో ‘గ్రేట్ ఇస్లామిక్ వార్' మొదలై 2043 నాటికి రోమ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని ఆమె చెప్పారు.
ఇంతకీ ఎవరీ బాబా వాంగ పన్డేవా. బల్గేరియాలోని పెట్రిచ్ నగరంలో 1911, జనవరి 31న పన్డేవా జన్మించారు. 1996 ఆగస్టు 11న మరణించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లలో ఇసుక పడటంతో ఆమె చూపుని కోల్పోయారు. తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు.
తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఉన్న చోటును వివరాలతో సహా ఊహించి చెప్పడంతో ఆమె జోస్యం ప్రారంభమైంది. దీంతో 30 ఏళ్లు వచ్చేసరికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలోపేతం అయ్యాయని బల్గేరియా వాసులు నమ్ముతున్నారు.
ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ఆమెను ‘నోస్ట్రడామస్ ఆఫ్ ద బాల్కన్స్'గా పిలుచుకుంటున్నారు. జర్మనీ నియంత హిట్లర్ సైతం ఓసారి పన్డేవాను పిలిచారని, ఆందోళనకు గురైన ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయారని అక్కడి ప్రజలు చెబుతారు. రెండో ప్రపంచయుద్ధంతో పాటు కొన్ని సంఘటనలను ముందే ఊహించి పన్డేవా చెప్పారు.
పన్డేవా ఊహించిన చెప్పిన జోస్యాల్లో 68 శాతం వరకూ నిజమయ్యాయని చెబుతుంటారు. అమెరికాలోని ట్విన్ ట్వవర్స్ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే బల్గేరియా మహిళ బాబా వాంగ పన్డేవా చెప్పడం విశేషం.
బాబా వాంగ పన్డేవా చెప్పిన జోస్యాల్లో నిజమైనవి:
*
అమెరికా
అధ్యక్షుడు
కెన్నడీ,
భారత
ప్రధానులు
ఇందిర,
రాజీవ్
హత్యల
గురించీ
ముందే
ఊహించి
చెప్పారు.
*
‘లోహ
విహంగాల
దాడితో
అమెరికా
సోదరులు(ట్విన్
టవర్స్)
కూలుతారు.
పొద(అప్పటి
అధ్యక్షుడు
‘బుష్'ను
ఉద్దేశించి)లో
తోడేళ్లు
అరుస్తాయి.
అమాయకుల
రక్తం
పారుతుంది'
అంటూ
2001,
సెప్టెంబరు
11న
ట్విన్టవర్స్
కూల్చివేత
గురించి
1989లోనే
చెప్పారు.
*
‘‘ఓ
పెద్ద
అల
తీరాన్ని
కమ్మేస్తుంది.
గ్రామాలు,
ప్రజలు
జలసమాధి
అవుతారు''
అంటూ
2004లో
థాయిలాండ్
తీరంలో
సునామీ
గురించి
జోస్యం
చెప్పారు.
*
ఆగస్టు
1999
లేదా
2000లో
కురుస్క్
నీటిలో
మునిగిపోతుంది.
*
ప్రపంచం
కలవరానికి
గురవుతుందని
1980లో
చెప్పారు.
2000
ఆగస్టులో
రష్యాకు
చెందిన
‘కురుస్క్'
అణు
జలాంతర్గామి
సముద్రంలో
ప్రమాదానికి
గురికావడంతో
ప్రపంచదేశాలు
వణికిపోయాయి.
*
బల్గేరియా
రాజు
బోరిస్-3
ఆగస్టు
28,
1943న
చనిపోతారని
చెప్పగా..
1944
ఆగస్టు
28న
చనిపోయారు.
బాబా వాంగ పన్డేవా చెప్పిన భవిష్యత్ జోస్యాలు:
*
5079లో
ఈ
విశ్వం
అంతమవుతుంది.
*
3797నాటికి
భూమిపై
మనిషి
జాతి
ఉండదు.
*
2018లో
శుక్రుడిపై
కొత్త
ఇంధనం
కనుగొంటారు.
*
ప్రపంచంలోని
చాలా
ప్రాంతాల్లో
మళ్లీ
కమ్యూనిజం
వ్యాప్తి
చెందుతుంది.
*
2023లో
భూమి
కక్ష్య
మారుతుంది.
దీనివల్ల
ధృవాల
వద్ద
మంచు
కరిగి
సముద్రాలు
పొంగుతాయి.
*
సిరియాలో
మొదలయ్యే
ఇస్లామిక్
వార్
2043లో
రోమ్ను
స్వాధీనం
చేసుకోవడంతో
ముగుస్తుంది.
*
ఈ
సందర్భంలో
యూర్ప
ప్రజలంతా
మృత్యువాతపడి,
భూమిపై
జాతి
అనేది
ఉండదు.
*
2130లో
నీటిలో
నివసించేలా
గ్రహాంతరవాసులు
మనుషులకు
సాయం
చేస్తారు.
*
3005లో
అంగారకుడిపై
యుద్ధం
జరుగుతుంది.
*
చంద్రుడిని
తోకచుక్క
ఢీకొంటుంది.
భూమి
చుట్టూ
రాళ్లు,
బూడిద
వలయం
ఏర్పడుతుంది.