వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిబియాలో ఘోర ప్రమాదం: రెండు పడవలు బోల్తా, 170 మంది గల్లంతు
లిబియా: మధ్యధరా సముద్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. దీంతో 170 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. లిబియా తీరంలో శనివారం ఓ పడవ మునిగి పోయినట్లు ఇటలీ నావికాదళం వెల్లడించింది.
ఇందులో దాదాపు 117 మంది ఉన్నట్లు తెలిపారు. వీరిలో పది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక శిశువు ఉన్నారు. ఈ పడవ లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి ప్రయాణం ప్రారంభించిన పది గంటల్లో మునిగిపోయినట్లు తెలిపారు.
మరో పడవ మొరాకో నుంచి బయలుదేరి మధ్యధరా సముద్రానికి పశ్చిమాన అలబోరన్ సముద్రంలో మునిగింది. ఈ పడవలో యాభై మందికి పైగా ఉన్నారు. ఈ పడవ నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఇటలీ నావికాదళం గాలింపు చర్యలు చేపట్టింది.
Comments
English summary
An estimated 170 migrants have gone missing in the Mediterranean in two incidents involving dinghies that left from Libya and Morocco, migrants organisations have said.
Story first published: Sunday, January 20, 2019, 15:29 [IST]