వైరస్ను లెక్కచేయని ట్రంప్.. ర్యాలీలలో జోరుగా ప్రచారం, బిడెన్ విమర్శలు.. వ్యాక్సిన్ ఏది అని..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ట్రంప్- బిడెన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవలే కరోనా వైరస్ సోకి.. కోలుకున్న ట్రంప్ జనసమూహాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జనాల్లోకి దూసుకెళుతున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న పట్టించుకోవడం లేదు. తన ప్రచారం చేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రచారంలోనే కాదు డిబేట్లలో కూడా కరోనా వైరస్ గురించి ట్రంప్, బిడెన్ మధ్య జోరుగా చర్చ జరిగింది. తన ర్యాలీలో బిడెన్.. ట్రంప్పై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ట్రంప్ ర్యాలీలలో జనం భౌతిక దూరం పాటించడం లేదు. ఇదే కాదు మొహానికి మాస్క్ కూడా ధరించడం లేదు. అయితే ప్రచార పర్వం ఎలా ఉన్న ఫలితాలు మాత్రం మారుతున్నాయి. 2016లో కూడా ప్రచారం హిల్లరీకి అనుకూలంగా సాగగా.. అనూహ్యంగా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు బిడెన్ పేరు మారుమోగిపోతోంది. కానీ ఏం జరుగుతుందోనని విశ్లేషకులు అంటున్నారు.
Recommended Video
అమెరికన్ల కోసం అమెరికా అంటూ ట్రంప్ ప్రచారం చేస్తుండగా.. ముస్లింల ప్రవేశం, ఇతర అంశాలను బిడెన్ ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్, ఆర్థికమాంద్యం గురించి బిడెన్ విమర్శలు గుప్పిస్తున్నారు. వైరస్ కోసం వ్యాక్సిన్ ఇప్పటివరకు రూపొందించలేదని.. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం అని బిడెన్ విరుచుకుపడుతున్నారు. అయితే బిడెన్ను గెలిపించొద్దని.. ఆయన గెలిస్తే దారులు తెరుస్తారని అమెరికన్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.