కాస్త చదవండి: డొక్లాంపై చైనాకు భూటాన్ దిమ్మతిరిగే షాక్, యుద్ధమా.. ఆ గ్రామం ఖాళీ!
డొక్లామ్ తమదేనని భూటాన్ అంగీకరించిందని చైనా ఇటీవల చెప్పింది. దీనిపై భూటాన్ స్పందించింది. డొక్లామ్ చైనాది అని తాము అంగీకరించలేదని చెప్పింది. చైనా అబద్దాలు ఆడటం సరికాదని పేర్కొంది.
బీజింగ్/న్యూఢిల్లీ: డొక్లామ్ తమదేనని భూటాన్ అంగీకరించిందని చైనా ఇటీవల చెప్పింది. దీనిపై భూటాన్ స్పందించింది. డొక్లామ్ చైనాది అని తాము అంగీకరించలేదని చెప్పింది. చైనా అబద్దాలు ఆడటం సరికాదని పేర్కొంది.
డొక్లామ్ ప్రాంతం చైనాదిగా తాము ఎప్పుడూ చెప్పలేదని, ఎప్పుడూ గుర్తించలేదని భూటాన్ తేల్చి చెప్పింది. తద్వారా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగే జవాబు చెప్పింది.

కాస్త చదివి చూడండి
డొక్లామ్ విషయంలో మా ప్రకటన చాలా స్పష్టంగా ఉందని భూటాన్ చెప్పింది. 29 జూన్ 2017న తమ విదేశాంగ వెబ్ సైట్లో చదివి తెలుసుకోవాలని చైనాకు సరైన కౌంటర్ ఇచ్చింది. చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ వెన్లీ.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా భూటాన్ అంగీకరించిందని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.
Recommended Video


సరిహద్దు గ్రామ ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశం
గత రెండు నెలలుగా డొక్లామ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. డొక్లామ్ ప్రాంతానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాథంగ్ గ్రామాన్ని ఖాళీ చేయాలని గ్రామస్తులకు చెబుతున్నారు. అయితే, వీరు ఖాళీ చేయడానికి డొక్లామ్ ఇష్యూ కారణం కాదని కూడా అంటున్నారు. వారిని ఖాళీ చేయిస్తుండటంతో యుద్ధం వస్తుందా అనే చర్చ సాగుతోంది.

డొక్లాంలో 53 మంది ఇండియన్ ఆర్మీ: చైనా
డోక్లాం ప్రాంతంలో 53 మంది భారతీయ సైనికులు, ఒక బుల్డోజరు ఉన్నట్లు చైనా విదేశాంగశాఖను ఉటంకిస్తూ....అధికార వార్తాపత్రిక ‘గ్లోబల్ టైమ్స్' తెలిపింది. తక్షణం తమ భూభాగం (చైనా చెప్పుకోవడమే)నుంచి దళాలను ఉపసంహించుకోవలసిందిగా భారత్ను కోరింది.

కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరిక
డొక్లామ్ ప్రాంతంలో భారత్ సైన్యాన్ని ఉపసంహరించుకోకపోవడంపై చైనా పదే పదే హెచ్చరికలు, ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. భారత్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇరుదేశాల మధ్య యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చైనా మీడియా రాసింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications