శ్వేతసౌధం నుంచి పామ్బీచ్కు.. ఇళ్లు మారబోతున్న అగ్రరాజ్య అధినేత, సెప్టెంబర్లో హింట్.. ట్వీట్...
అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇళ్లు మారబోతున్నారు. అవును ట్రంప్ ప్రాథమిక నివాసం ఇక వైట్హౌస్ కాదు ప్లోరిడాలోని తన సొంతిళ్లు కాబోతుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. తాను ఎందుకు ఇళ్లు మారుతున్నాననే విషయాన్ని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షులు న్యూయార్క్లోని శ్వేతసౌధంలో ఉంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు, వసతులు ఉంటాయి. కానీ ట్రంప్ మాత్రం తన సొంతిళ్లు ప్లోరిడాకు వెళతాను మొర్రొనని మొత్తుకుంటున్నారు. తాను న్యూయార్క్ రావడంతో ప్లోరిడాలో తన పరపతి తగ్గిపోతుందని చెప్పారు. అంతేకాదు వారెవరు తనను పట్టించుకోవడం లేదని.. తనతో దారుణంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.
తమ సొంతిళ్లు అయిన ప్లోరిడాలోని పామ్ బీచ్కు షిప్ట్ అవుతామని పేర్కొన్నారు. వాస్తవానికి తనకు న్యూయార్క్ అంటే ఇష్టమని.. కానీ సొంత ఊరిలో పరపతి తగ్గుతున్నందున వెళ్లడం తప్పడం లేదని చెప్పారు. ప్లోరిడాలో తన నివాసానికి కూడా మిలియన్ డాలర్ల పన్ను కడుతున్నారని ట్రంప్ పేర్కొనడం విశేషం. దీంతోపాటు ప్లోరిడాకు చెందిన కొందరు రాజకీయనేతలు తనకు విలువ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న గౌరవ, మర్యాదలు తగ్గుతున్నాయని.. అందుకోసమే ప్లోరిడాకు మకాం మారుస్తున్నానని స్పష్టంచేశారు.
ప్రాథమిక ఇళ్లు మారే విషయంపై సెప్టెంబర్లోనే ట్రంప్ దంపతులు హింట్ ఇచ్చారు. దీనిని కోట్ చేస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే దీనిని వైట్ హౌస్ వర్గాలు మాత్రం ధ్రువీకరించడం లేదు. అతను ఎందుకు ఇళ్లు మారాలనుకున్నారనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు.