మరింత చల్లగా భూ గ్రహం, సూర్య రశ్మి తగ్గడంతో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మంచుయుగంగా...
వాయు కాలుష్యంతో భూమి గ్రహంపై కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాబోయే 30 ఏళ్లలో అతిశీతల పరిస్థితులు ఉంటాయని, మంచు తుఫాన్లు వస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 30 ఏళ్లలో సూర్య రశ్మి క్రమంగా తగ్గుతోందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు మంచు యుగాన్ని తలిస్తోందని పేర్కొన్నడం భయాందోళన కలిగిస్తోంది.
తగ్గుతోన్న సూర్యరశ్మి..
ఆ సమయంలో సూర్యుడు నిద్రాణస్థితికి చేరుకుంటారని.. దీంతో ఆహార కొరత వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూ గ్రహంపై ఆహార కొరతతో సమస్త జీవులు అల్లాడిపోతాయని పేర్కొన్నది. దీనిని మొదట ‘టైమ్స్ ఇఫ్ ఇండియా' నివేదించింది.
తక్కువ శక్తి విడుదల..
సౌర కనిష్టం అంటే సూర్యుడు సాధారణం కంటే తక్కువ శక్తి, లేదంటే వేడి విడుదల చేస్తారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దానికి తగ్గట్టు ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. 2020లో 200 ఏళ్ల కంటే తక్కువ సూర్యరశ్మి నమోదవుతోందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు కనీసం 1 డిగ్రీ వరకు పడిపోతుందని పేర్కొన్నారు. ఇలా ఏడాది మొత్తం చల్లని వాతావరణం ఉంటుందని నార్త్ అంబ్రియా వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మంచుతుపాన్లు.
భూమిపై
తక్కువ
సూర్యరశ్మి
నమోదవుతోందని
శాస్త్రవేత్త
ప్రొఫెసర్
జార్కొవా
పేర్కొన్నారు.
భూమితోపాటు
ఇతర
గ్రహాలకు
కూడా
తక్కువ
సూర్యరశ్మి
విడుదలవుతోందని
తెలియజేశారు.
వాస్తవానికి
ప్రతీ
11
ఏళ్లకు
సూర్యరశ్మి
తగ్గుతున్నప్పటికీ..
ఈ
ఏడాది
చల్లగా
ఉంటుందని..
వచ్చే
30
ఏళ్లలో
పరిస్థితి
తారుమారవుతోందని
చెప్పారు.
2020లో
కెనడాలో
ఇప్పటికే
ప్రారంభమైందని
పేర్కొన్నారు.