వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రైస్తవులు వెళుతున్న బస్సుపై ఉగ్ర కాల్పులు: ఏడుగురు మృతి, 16మందికి గాయాలు
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రైస్తువల బృందం వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఆరుగురున్నారు. చర్చి నుంచి వీరంతా తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కైరోలోని మినిమియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
Comments
egypt cairo christians terrorists firing killed bus ఈజిప్టు కైరో క్రైస్తవులు ఉగ్రవాదులు కాల్పులు మృతి
English summary
At least seven people killed, 16 injured in an attack on a bus heading towards Coptic monastery in Egypt, reports Reuters.