రంజాన్ సెలవుల విషాదం: దుబాయ్లో రోడ్డు ప్రమాదం: 8 మంది భారతీయులు దుర్మరణం
దుబాయ్: రంజాన్ సెలవులు విషాదాన్ని మిగిల్చాయి. 17 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ 17 మందిలో ఎనిమిది భారతీయులే. రంజాన్ సెలవులు ముగించుకుని స్వస్థలానికి తిరిగి వస్తున్న వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులతో పాటు 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో అయిదుమంది తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ జీవనోపాధిని వెదుక్కుంటూ దుబాయ్కు వెళ్లిన వారేనని స్థానిక అధికారులు నిర్ధారించారు.
#Announcement on the unfortunate accident which occured at Dubai and led to fatalities and injuries pic.twitter.com/X15z3woPxH
— مواصلات MWASALAT-عُمان (@mwasalat_om) June 6, 2019
రంజాన్ పండగ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో అయిదురోజుల పాటు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో దుబాయ్కు చెందిన సుమారు 31 మంది ఓ ప్రైవేటు బస్సులో విహారయాత్ర కోసం పొరుగునే ఉన్న ఒమన్కు వెళ్లారు. ఒమన్ నుంచి గురువారం మధ్యాహ్నం వారు దుబాయ్కి తిరుగుముఖం పట్టారు. వారు ప్రయాణిస్తున్న బస్సు సాయంత్రానికి దుబాయ్ శివార్లకు చేరుకుంది. షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. వారిని రాజగోపాలన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీట్టిల్, కిరణ్ జానీ, వాసుదేవ్, తిలక్రామ్, జవహర్ ఠాకూర్గా గుర్తించారు. మృతుల్లో నలుగురు తమిళనాడు, కేరళకు చెందిన వారు. మరో అయిదుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో మిగిలిన వారు కూడా వివిధ దేశాల నుంచి దుబాయ్కు వలస వచ్చిన వారేనని అధికారులు తెలిపారు.
1/2) We are sorry to inform that as per local authorities and relatives it is so far confirmed that 8 Indians have passed away in Dubai bus accident. Consulate is in touch with relatives of some of the deceased & awaits further details for others to inform their families.
— India in Dubai (@cgidubai) June 6, 2019