ప్రపంచ భారీకాయురాలు.. ఎమాన్ అహ్మద్ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్ అహ్మద్ కన్నుమూశారు. ఈజిప్ట్కు చెందిన ఎమాన్ ను బరువు తగ్గించే చికిత్స నిమిత్తం 2016లో ముంబైకి తీసుకొచ్చారు. ఆమె సగం బరువు కూడా తగ్గారు.
అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత భారీకాయురాలు ఎమాన్ అహ్మద్ కన్నుమూశారు. ఈజిప్ట్కు చెందిన ఎమాన్ ను బరువు తగ్గించే చికిత్స నిమిత్తం 2016లో ముంబైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ముంబైలోని
సైఫీ
ఆసుపత్రిలో
కొంతకాలం
ఆమెకు
చికిత్సను
అందించారు.
ఆ
తర్వాత
మెరుగైన
చికిత్స
నిమిత్తం
ఆమెని
అబుదాబిలోని
బుర్జీల్
ఆసుపత్రికి
తరలించారు.
అక్కడ
చికిత్స
పొందుతూ
సోమవారం
తుదిశ్వాస
విడిచారు.
కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె చనిపోయినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఎమాన్ సగం బరువు తగ్గిన సంగతి తెలిసిందే.
తరువాత ఆమె తనంతట తానే తినగలిగే స్థితికి చేరిందని గతంలో వైద్యులు కూడా తెలిపారు. ఆ తరువాత దుబాయ్ లోని మరో అధునాతన ఆసుపత్రిలో మరింత మెరుగైన చికిత్స కోసం అంటూ ఆమెను ఆమె బంధువులు జూన్లో అబుదాబికి తరలించారు. మరికొంతకాలంలో పూర్తిగా కోలుకుంటుంది అనుకునేలోపే ఎమాన్ కన్నుమూసింది.