పేలిపోయిన రసాయన పరిశ్రమ: కిలోమీటర్ దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం
బీజింగ్: చైనాలో భారీ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఓ రసాయనిక పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ పేలుడులో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఝియాంగ్షు ప్రావిన్స్ యాంగ్ చెన్ ప్రాంతంలోని తియాన్ఝియా రసాయనిక పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది.
గులాబీ గూటికి నామా : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
పేలుడు సమయంలో పలువురు కార్మికులు పరిశ్రమలో రోజువారీ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఊహించని విధంగా, ఒక్కసారిగా సంభవించిన పేలుడులో రసాయనిక పరిశ్రమలో అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. గ్ఝియాన్గ్షుయ్ ఎకో-కెమికల్ ఇండస్ట్రీయల్ జోన్ లో ఈ పరిశ్రమ ఉంది. గురువారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:48 నిమిషాలకు పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి ప్రకంపించింది. పేలుడు చోటు చేసుకున్న వెంటనే అక్కడ 2.2 తీవ్రతతో భూమి ప్రకంపించింది. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటానస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 30 మందికి పైగా కార్మికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ రసాయనిక పరిశ్రమకు కిలోమీటర్ దూరంలో ఓ కిండర్ గార్టెన్ ఉంది. అక్కడి దాకా పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు తీవ్రతకు కిటికీ అద్దాలు పగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద శబ్దంతో రసాయనిక పరిశ్రమ పేలిపోయిన వెంటనే సుమారు 50 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడ్దాయి. సంఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది.