ఒబామా వీడ్కోలు ఫోటోలు భావోద్వేగానికి గురికాకతప్పదు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీడ్కోలు సందర్భంగా ఆయన ఫోటో గ్రాఫర్ తీసిన చిత్రాలు బావోద్వేగాలకు గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలను ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అమెరికా:అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీడ్కోలు సందర్భంగా ఆయన వ్యక్తిగత ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలు బావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటో లు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా షేర్ చేస్తున్నారు.ఈ ఫోటోలను చూసిన వారంతా ఫోటోగ్రాఫర్ ను గుర్తుకు చేసుకోకతప్పదు.
అమెరికా అద్యక్షుడిగా బరాక్ ఒబామా ఎనిమిదేళ్ళపాటు పనిచేశాడు. రెండు దఫాలు ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే ఒబామా తన అధికారిక ఫోటోగ్రాఫర్ గా పిటిసౌజా అనే వ్యక్తిని నియమించుకొన్నాడు.
ఒబామా తన పదవీకాలాన్ని ముగించుకొని వెళ్తున్న వేళ పిటీ సౌజా తీసిన ఫోటోలు పలువురిని భావోద్వేగాలకు గురిచేస్తున్నాయి. ఒబామా వీడ్కోలు సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను పిటీసౌజా ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫోస్టుచేశారు.
ఎనిమిదేళ్ళ నుండి పిటీసౌజా ఒబామాకు పోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అంతకుముందు నాలుగేళ్ళ నుండి ఆయనకు ఒబామాతో పరిచయం ఉంది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఒబామా ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన చిత్రాలు 20 లక్షల ఫోటోలు తీశారు.
వైట్ హౌస్ కు అత్యధిక కాలం పాటు పనిచేసిన ఫోటో గ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తిగా కూడ ఆయన రికార్డు నెలకొల్పాడు. ఒబామా వైట్ హౌజ్ లోని తన అధికారిక కార్యాలయం నుండి తిరిగి వెళ్ళిపోయే సమయంలో హెలిక్యాప్టర్ లో కూర్చొని విండో లో నుండి వైట్ హౌస్ ను గగనతలం నుండి చూస్తుండగా తీసిన ఫోటో ను ఆయన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశాడు.ఈ పోటోలను చూసిన ప్రతి ఒక్కరూ బావోద్వేగానికి గురికాక తప్పదు. దీంతో ఈ పోటోలను చూసినవారంతా విపరీతంగా షేర్ చేస్తున్నారు.