రోమ్ ఎయిర్ పోర్టులో అగ్ని ప్రమాదం: ప్రయాణికుల కష్టాలు
రోమ్: రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆకస్మికంగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు, సిబ్బంది హడలి పోయారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోమ్ లోని ఫియుమిచినో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
ఎప్పటిలాగే ప్రయాణికులు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. రనేవేల మీద విమానాలు సిద్దంగా ఉన్నాయి. ఆ సమయంలో ఎయిర్ పోర్టు ఆవరణంలో టర్మినల్-3లోని బార్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు.
ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేస్తున్నామని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోమ్ ఎయిర్ పోర్టు నుండి వివిధ దేశాలకు వెళ్లవలసిన విమానాలు, వివిద దేశాల నుండి వచ్చే విమానాల సర్వీసులు నిలిచిపోయాయి. మంటలు పూర్తిగా అదుపు చేశారు.
వేలాధి మంది ప్రయాణికులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలలోనే నిద్రపోయారు. శుక్రవారం ఉదయం నుండి ఎప్పటి లాగే విమాన సర్వీసులు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.