బద్దలైన అగ్నిపర్వతం: విమానాలు బంద్
జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు.
శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం గుర్తించిన ఇండోనేషియా ఎయిర్ లైన్స్ అధికారులు లంబాక్, బాలి, జంబర్, బన్ యూవాంగి ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నామని ప్రకటించారు.
ప్రయాణికులకు వీలుగా ఇదే విషయం ట్విట్ చేశారు. అప్పటికే ఎయిర్ పోర్టులు చేరుకున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. వెనక్కి తిరిగి వెళ్లలేక ఎయిర్ పోర్టులోనే మకాం వేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు.
తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీుసుకుంటామని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం బద్దలు కావడంతో విపరీతమైన బూడిద ఆకాశాన్ని తాకింది. అందు వలన ఈ నాలుగు ఎయిర్ పోర్టు ల నుండి సర్వీసులను రద్దు చేశారు. మిగిలిన ఎయిర్ పోర్టుల నుండి విమానా సర్వీసులు సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.