వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఫోక్ సింగర్ రేష్మ కన్నుమూత, నెలనుండి కోమాలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Folk singer Reshma died
ఇస్లామాబాద్: ప్రముఖ పాకిస్తాన్ ఫోక్ సింగర్ రేష్మ ఆదివారం ఉదయం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్ను మూశారు.

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా రేష్మా కోమాలో ఉన్నారు. రేష్మ 1947లో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌లో ఓ బంజారా కుటుంబంలో జన్మించారు.

కొన్నాళ్లకు ఆమె కరాచీలో స్థిర పడింది. రేష్మకి ఓ కోడుకు, ఓ కూతురు ఉన్నారు. రేష్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు జియో టివిలో వార్తలు వచ్చాయి.

రేష్మకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు షహబాజ్ కలందర్ విగ్రహం వద్ద పాడిన పాట విన్న ఓ టెలివిజన్, రేడియో నిర్మాత ఆమెకు లాల్ మేరీతో అవకాశమిచ్చారు. అది సూపర్ హిట్ అయింది. రేష్మ పాకిస్తాన్‌లో ప్రముఖ ఫోక్ సింగర్లలో ఒకరు.

English summary

 Renowned Pakistani folk singer Reshma, who was suffering from throat cancer for a long time, died in Lahore Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X