నైస్ దాడికి ముందే 2సార్లు రెక్కీ నిర్వహించిన ఉగ్రవాది
ప్యారిస్: ఫ్రాన్స్లోని నీస్ ప్రాంతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాది మొహమ్మద్ లాహౌజ్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది.
నీస్ నగరంలో బాస్టల్ ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84మంది మృతికి కారణమైన మొహమ్మద్ లాహౌజ్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో మొహమ్మద్ లాహౌజ్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే ఆ తర్వాత కొంతకాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని తేల్చారు.
ఫ్రాన్స్ దాడి: స్త్రీ అరెస్ట్, 'అతనో తిరుగుబోతు, స్త్రీలోలుడు'
కాగా, ట్రక్తో దాడికి పాల్పడిన మొహమ్మద్ లాహౌజ్ మాజీ భార్య కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. పోలీసులు శుక్రవారం నాడు ఇద్దరిని, శనివారం నాడు ముగ్గురిని అరెస్టు చేశారు.