వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగాతో ఆరోగ్యం, మనశ్శాంతి... అర్జెంటీనాలో ప్రజలకు యోగాపై ప్రధాని క్లాస్

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యం, మనస్సుకు శాంతిని ఇచ్చే యోగా ప్రపంచానికి ఒక బహుమానం అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్యూనస్ ఏరీస్‌లో యోగా పై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ యోగా గురించి చెప్పారు. యోగా చేయడం వల్ల ప్రతిఒక్కరితోను సంతోషం పంచుకునే యోగం దక్కుతుందని ప్రధాని చెప్పారు. తాను 24 గంటలకు పైగా ప్రయాణించి 15వేల కిలోమీటర్లు దాటి వచ్చినట్లు చెప్పిన ప్రధాని... అక్కడి వారు కనబర్చిన ప్రేమ ఉత్సాహం చూసి తాను భారత్‌లో ఉన్న భావనే కలిగిందని చెప్పారు.

 భారత్‌ అర్జెంటీనాలను యోగా అనుసంధానం చేస్తోంది

భారత్‌ అర్జెంటీనాలను యోగా అనుసంధానం చేస్తోంది

యోగా ఫర్ పీస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆపేరు పెట్టినందుకు మోడీ అభినందించారు. యోగా అనేది మనస్సును శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుందన్నారు. మనస్సు ప్రశాంతంగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని... తద్వారా సమాజం, దేశం, ప్రపంచంలో శాంతి నెలకొంటుందని చెప్పారు. యోగా భారత దేశానికి ఒక అపురూపమైన కానుకగా అభివర్ణించిన ప్రధాని... భారత్‌ను అర్జెంటీనాను అనుసంధానం చేస్తోందని చెప్పారు. ఇరుదేశాలతో పాటు ఇక్కడి ప్రజలను కూడా యోగా కలుపుతోందన్నారు.

భారత్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులున్నారు

భారత్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులున్నారు

అర్జెంటీనాలో చాలామందికి భారత కళలు, సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు ప్రధాని. అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు భారత్‌లో చాలా మంది అభిమానులున్నారని తెలిపారు. మారడోనా పేరును ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ఉంటారని చెప్పారు. అంతేకాదు ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచ కప్‌ తొలిమ్యాచ్‌లో అర్జెంటీనా గెలవడంపై ఆ జట్టుకు అభినందనలు తెలిపారు. జీ-20 సదస్సును అర్జెంటీనా నిర్వహించడాన్ని తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పిన ప్రధాని ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన అభివృద్ధి, వాతావరణం, రుణఎగవేతదారులపై చర్చిస్తామన్నారు.

ఆంటోనియో గుటెరర్స్, సౌదీ రాజులతో ప్రధాని భేటీ

ఆంటోనియో గుటెరర్స్, సౌదీ రాజులతో ప్రధాని భేటీ

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరర్స్‌తో సమావేశమై ప్రపంచ వాతావరణ పరిస్థితిపై భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చర్చించారు. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలిశారు ప్రధాని . ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తీసుకోవాల్సి న చర్యలు, సాంస్కృతిక, ఇంధనం అంశాలపై చర్చించారు. అంతేకాదు సాంకేతిక, పునరుద్పాదక శక్తి, ఆహార భద్రతపై పెట్టుబడలపై చర్చించారు.

English summary
Yoga is India's gift to the world for health and peace, Prime Minister Narendra Modi said on Thursday as he highlighted the benefits of the ancient Indian practice for overall wellbeing.Addressing participants at a yoga event in Buenos Aires, he said the practice connects everyone to happiness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X