వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు నిజంగా పఠాన్ కు పుట్టిన బిడ్డవే అయితే..: మోడీ: ఎస్..నేను పఠాన్ బిడ్డనే..: ఇమ్రాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఏదీ లేదంటూ పాకిస్తాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పుల్వామా ఉగ్రదాడిని తమ నెత్తిన రుద్దవద్దంటూ ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ప్రకటించారు.

దాడికి, తమకు సంబంధం లేదని అంటూ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పుడు ఆయన గొంతు మారింది. కాస్త మెత్తబడ్డారు. మెట్టు దిగారు. పుల్వామా ఉగ్రవాదుల దాడికి సంబంధించిన సరైన ఆధారాలను తమకు ఇవ్వగలిగితే, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Give peace a chance, pleads Pakistan PM Imran Khan after PM Modi’s ‘son of Pathan’ words

ఇమ్రాన్ ఖాన్ స్వరం మారడానికి కారణం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవలే చేసిన ఓ ప్రకటన దీనికి ప్రధాన కారణం. పఠాన్ కుటుంబంలో జన్మించిన బిడ్డవే అయితే, ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి.. అని అంటూ మోడీ పాకిస్తాన్ ప్రధానికి సవాలు విసిరారు. పఠాన్ల కుటుంబంలో జన్మించిన వారెవెరూ ఇలా మాటలు మార్చరని చురకలు అంటించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇమ్రాన్ కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నారు.

తాను పఠాన్ల బిడ్డనేనని, నిజం మాట్లాడతానని, నిజాన్ని అనుసరిస్తానని ఇమ్రాన్ చెప్పారు. తనకు కొంత గడువు కావాలని కోరారు. కొంత సమయం ఇస్తే, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతానని అన్నారు. 2015 తాను మోడీని కలిశానని, తాను అధికారంలోకి వస్తే దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రాధాన్యత ఇస్తానని మాట ఇచ్చిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు.

Give peace a chance, pleads Pakistan PM Imran Khan after PM Modi’s ‘son of Pathan’ words

చెప్పిన మాట ప్రకారం పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతాన్ని కల్పించే చర్యలను తాను సమర్థించబోనని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం తాను తీసుకుంటున్న చర్యలకు ఉగ్రవాద కార్యకలాపాలు అడ్డంకిగా మారాయని అన్నారు. తనకు కొంత గడువు ఇవ్వాలని, ఉగ్రవాదులను అణచి వేస్తానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పుల్వామా దాడి ఉగ్రవాదుల పనేనని చెప్పడానికి సాంకేతికపరమైన, సరైన సాక్ష్యాధారాలను అందిస్తే, కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

English summary
Pakistani Prime Minister Imran Khan on Sunday said that he is favour of peace in the region and stands by his words that if India provides Pakistan with actionable intelligence with regard to the Pulwama terror attack, he will immediately act. According to a statement released by the Prime Minister’s Office, Khan said that Pakistan wants stability in the region and that PM Narendra Modi should give peace a chance. The remark comes a day after PM Modi asked his Pakistani counterpart to keep his word as a son of Pathan and fight poverty and illiteracy together with India instead of fighting each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X