జుకర్బర్గ్ తర్వాత.. సుందర్ పిచాయ్ అకౌంట్ హ్యాకింగ్
వాషింగ్టన్: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ అనంతరం.. హ్యాకింగ్ గ్రూప్ అవర్ మైన్ తాజా టార్గెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అయ్యారు. సుందర్ పిచాయ్ క్వారా అకౌంటును అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసింది.
క్రౌడ్ సోర్స్డ్ సమాధాన సైట్కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టడు చేసింది. పిచాయ్ ఫాలోవర్స్ 508,000 మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లను తొలగించినా.. హ్యాకింగ్ స్క్రీన్ షాట్లు బయటకు వెల్లడించింది.
అయితే, ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగుకు ఎలా పాల్పడుతుంతో స్పష్టంగా తెలియడం లేదు. అవర్ మైన్ తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగుకు సోమవారం పాల్పడ్డామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడి చేసే అవకాశముందని చెప్పింది.