వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యదరా సముద్రంలో పడవ మునక: 700 మంది గల్లంతు
మధ్యధరా సముద్రంలో వలసకూలీలతో ప్రయాణిస్తున్న ఓ నౌక మునిగిపోయింది. అందులో దాదాపు ఏడువందల మంది కూలీలు ఉన్నారని సమాచారం. ఈ నౌక మునిగిపోవడంతో వారందరూ గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వలస కూలీలను కాపాడేందుకు లిబియా జలాలలోని లాంపడూస తీరానికి 130 మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటలీకి చెందిన నౌకలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇరవై ఎనిమిది మంది కూలీలను కాపాడినట్లుగా తెలుస్తోంది.
కాగా, నౌకలో ఏడువందల మంది కంటే ఎక్కువ మందే ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవలే మధ్యదరా సముద్రంలో నౌక ముక్కలైన విషయం తెలిసిందే. అది జరిగి వారం కాకముందే మరో ప్రమాదం జరగడం గమనార్హం.
Comments
English summary
grant ship carrying 700 capsizes in the Mediterranean sea
Story first published: Sunday, April 19, 2015, 15:41 [IST]