నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 31 ఉపగ్రహం.. కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగు
Recommended Video
కౌరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియానా రాకెట్ ద్వారా జీశాట్ - 31 ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపించారు. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల 31 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం. జీశాట్ -31 ఉపగ్రహంతో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహాన్ని కూడా మోసుకెళ్లింది ఏరియన్ 5 రాకెట్. కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగ్గా అందించనున్న జీశాట్ - 31.. నలభై రెండు నిమిషాల వ్యవధిలోనే నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
2,535 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్లపాటు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సేవలు అందించనుంది. ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఇది కొత్త రూపంగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. డీటీహెచ్ టీవి, డిజిటల్ శాటిలైట్, టీవి అప్లింక్స్ తదితర వాటికి అనుగుణమైన టెక్నాలజీ దీని సొంతం.
#Arianespace orbits two telecommunications satellites on first #Ariane5 launch of 2019. Read the #VA247 press release: https://t.co/ze1oCSAFoj pic.twitter.com/e3Bll545lu
— Arianespace (@Arianespace) February 5, 2019