హంజా బిన్ లాడెన్ మృతి.. ధ్రువీకరించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ కూడా మృతిచెందాడు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాకు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరే కార్యకలాపాల్లో భాగంగా ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో జరిపిన కాల్పులు హంజా చనిపోయాడని పేర్కొన్నారు.
హంజా మృతి అల్ ఖైదాకే కాదు .. ఉగ్రవాద గ్రూపునకు నేత, ముఖ్యమన కార్యకలాపాలు నిలిచిపోతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొన్నదని అమెరికా మీడియా తెలిపింది. అయితే హంజా బిన్ లాడెన్ ఎక్కడ చనిపోయాడనే అంశాన్ని మాత్రం ట్రంప్ పేర్కొనలేదు. హంజా బిన్ లాడెన్ గతేడాది స్టేట్ మెంట్ ఇస్తూ తుపాకీతో ఒక ప్రకటనలో కనిపించాడు. తర్వాత అతని ఆచూకీ తెలియరాలేదు. పౌరసత్వం కోసం సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని హంజా బెదిరించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో హంజా చనిపోయాడని మాత్రం అమెరికా మీడియా చెబుతుంది. అమెరికా, అమెరికా నిఘా వర్గాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయని తెలిపాయి. కానీ దీనిని అమెరికా ఉన్నతాధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. హంజా చనిపోయినట్టు అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.