ప్లేన్ క్రాష్, ఈజిప్ట్కు సెలవ్: తండ్రీకూతుళ్ల చివరి ఫోటో
కైరో: ఈజిప్ట్లోని సినాయి ద్వీపకల్పంలో కూలిపోయిన రష్యా విమానానికి సంబంధించి ఓ హృదయవిదారకమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ పర్యటన ముగించుకొని విమానం ఎక్కబోయె ముందు ఫోటో దిగిన తండ్రీ, కూతుళ్లు ప్రాణాలు విడిచారు.
ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ కలచివేస్తోంది. ఈజిప్టు పర్యటన ముగించుకుని ఎంతో సంతోషంగా బయలుదేరిన ఆ తండ్రీకూతుళ్లు విమానం ఎక్కబోయే ముందు ఒక ఫొటో దిగారు. ఆ ఫోటోను రష్యాకు చెందిన ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
దానికి ఓ కాప్షన్ ఇచ్చింది. 'ఈజిప్టుకు ఇక సెలవు... ఇంటికి వెళ్తున్నాము' అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసింది. కానీ, ఆ తర్వాత ఆ తండ్రీకూతుళ్లు శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.
శనివారం నాడు ఎయిర్ బస్ 321 విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానంలోనే రష్యాకు చెందిన లూరీ బయలుదేరాడు. లూరీ విమానం ఎక్కబోయే ముందు తన మూడేళ్ల కూతురు అనస్తాషియా షీన్ను ఎత్తుకుని ఫొటో కూడా దిగాడు. ఓల్గా షీన్ అనే రష్యా మహిళ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే వారు ప్రయాణిస్తున్న విమానం సినాయ్ ప్రాంతంలో కూలింది.