మహిళ వక్షోజాల పాలు: 15 లీటర్లను బలవంతంగా..
లండన్: అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళకు చెందిన దాచి పెట్టిన రొమ్ము పాలను విమానాశ్రయ సిబ్బంది ఏకంగా దాదాపు పదిహేను లీటర్లను బలవంతంగా పారబోయించారు. ఈ సంఘటన హీత్రో విమానాశ్రయంలో జరిగింది.
హీత్రో విమానాశ్రయ సిబ్బంది ఓ మహిళ నుంచి బలవంతంగా 14.8 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ (రొమ్ము పాలు) పారబోయించారు.
బాధితురాలి పేరు జెస్సికా కోక్లీ మార్టినెజ్. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె తన ఎనిమిది నెలల పిల్లాడు లేకుండా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్ల ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించింది. 14.8 లీటర్ల పాలను ఆమె వక్షోజాల పాలు తీసుకెళ్తున్నారు.
ఆమె ఎనిమిదేళ్ల కొడుకు ఆమె వెంట లేడు. ఆ తల్లి తన పిల్లాడి కోసం ఆ పాలను తీసుకెళ్తోంది. విమానాశ్రయ సిబ్బంది తీరుపై ఆమె తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. 'మీరు నా ఎనిమిది నెలల కొడుకుకు చెందిన రెండు వారాల ఆహారాన్ని బలవంతంగా పారబోయించార'ని పేర్కొంది.
దాదాపు పదిహేను లీటర్ల పాలను బలవంతంగా పారబోయించడం ద్వారా తన కొడుకుకు ఇప్పుడు ఆహారం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వర్క్ కోసం వెళ్తుండగా వారు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది.