పాకిస్తాన్ వద్ద అణుబాంబులు: హిల్లరీ క్లింటన్ ఆందోళన
వాషింగ్టన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన న్యూక్లియర్ సూసైడ్ బాంబర్ల పట్ల డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ చేతిలో ఆయుధాలు ఉన్న నేపథ్యంలో భారత్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారతే కాదు, హిల్లరీ క్లింటన్ సైతం పాకిస్తాన్ అణుబాంబుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పాకిస్తాన్ అణ్వాయుధాలు, అణుబాంబులు జీహాదీల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అందర్నీ భయపెట్టే అంశం అన్నారు.
భారత్తో విరోధం నేపథ్యంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసిందంటూ ఆమె తన సన్నిహిత వ్యక్తితో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అన్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. జీహాదీలు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకుంటే అణ్వాయుధాలు వారి చేతికి వెళతాయేమోనన్న భయంలో ఉన్నామని ఆమె చెప్పారు.