పాకిస్తాన్ లో హిందూ డాక్టర్ కాల్చివేత
కరాచీ: పాకిస్తాన్ లో మతం పేరుతో భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. అమాయకులను అతి దారుణంగా చంపేస్తున్నారు. ఇంటికి బయలుదేరిన ఓ హిందూ వైద్యుడి మీద దాడి చేసిన దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు.
కారాచీలో డాక్టర్ ప్రీతమ్ దాస్ (56) అనే వైద్యుడు హత్యకు గురైనాడు. పోలీసు అధికారి మహమ్మద్ కథనం మేరకు కారచీలోని లఖ్వానీ గార్డెన్ ఈాస్ట్ ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ ప్రీతమ్ క్లీనిక్ నిర్వహిస్తున్నాడు.
ఈ పరిసర ప్రాంతంలో ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెల్లడానికి క్లీనిక్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో దుండగులు ప్రీతమ్ మీద దాడి చేసి అతి దారుణంగా కాల్చి చంపేశారు.
తరువాత ఆయన సెల్ ఫోన్ నుంచి వారి ఇంటికి ఫోన్ చేశారు. ప్రీతమ్ హత్యకు గురైనాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘనా స్థలానికి చేరుకున్నారు.
ప్రీతమ్ కు ఎవ్వరితోనూ పాతకక్షలు లేవని, ఆయన అందరితో కలిసిమెలసి ఉంటారని, గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత వారం కరాచీ ఆసుపత్రిలో డాక్టర్ అనీల్ కుమార్ (32) అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. హిందువులు అంటే గిట్టని వారు ప్రీతమ్ దాస్ ను హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.